ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి న్యాయం జరగాలని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 08, 2018, 02:26 PM

ఏపీకి న్యాయం జరగాలనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విభజన సమయంలో బిల్లులోని అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 29 సార్లు ఢిల్లిdకి వెళ్లానన్నారు. ఆరోజు కాంగ్రెస్‌ చేసిందే ఇప్పుడు బీజేపీ చేస్తుంటే జాతీయ పార్టీలపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నిన్న జైట్లీ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. అన్యాయం జరిగిందనే కదా కాంగ్రెస్‌కు పనిష్మెంట్‌ ఇచ్చారన్నారు. తనకు ఎవరిపైనా కోసం లేదన్నారు. ప్రజల మనోభావాలను జాతీయ నాయకులు గౌరవించాలన్నారు.  ఆర్థిక లోటు 24,205.21 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. క్యాపిటల్ వ్యయం 28, 678.49 కోట్ల రూపాయలుగా అంచనావేశారు. కేంద్రం నుంచి ఆశించిన విధంగా సహకారం అందకపోవడంతో అందుబాటులో ఉన్న వనరుల మేరకు బడ్జెట్ రూపొందించినట్లు యనమల చెప్పారు. ఈ సారి బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తన బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com