సీఎం చంద్రబాబుతో బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. చంద్రబాబుకు ఇద్దరు బీజేపీ మంత్రులు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అసెంబ్లిలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబుకు రాజీనామా లేఖలు ఇచ్చిన వెంటనే మాణిక్యాలరావు బయటికి వచ్చేశారు. కాని బీజేపీ మంత్రి కామినేని మాత్రం తన రాజీనామా లేఖ ఇచ్చిన అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తమ రాజీనామాలపై చంద్రబాబుతో కామినేని చర్చిస్తున్నారు.