అమరావతి: ఏపీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత శాసనసభలో మంత్రి సోమిరెడ్డి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ను, మంత్రి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ను సమర్పించనున్నారు.