న్యూఢిల్లి :విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా నేడు పెను ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఒక లారీ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదనుంచి తొగాడియా క్షేమంగా బైటపడ్డారు. సూరత్లో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై తొగాడియా మాట్లాడుతూ తనపై హత్యా ప్రయత్నం జరిగిందన్నారు. తనకు జడ్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తన భద్రతపట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.