ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్, ఫుల్పూర్ లోక్సభ నియోజక వర్గాలకు జరుగనున్న ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పి)కి బహుజన సమాజ్వాదీ పార్టీ (బిఎస్పి) మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయమై బిఎస్పి త్వరలో అధికారికంగా ఒక ప్రకటన చేయనున్నది. ఉత్తర్ ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్యల రాజీనామాలతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగున్నాయి.