మేఘాలయలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పేర్కొంది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కాంగ్రెస్ నేతలు మేఘాలయ గవర్నర్ గంగా ప్రసాద్తో సమావేశమయ్యారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు గవర్నర్కు విన్నవించారు. ప్రాంతీయ పార్టీల సహకారం లభించే అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. మేఘాలయలో ఎక్కవ సీట్లు పొంది అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించిందని, కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకే మొదటి అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్నాథ్ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కువ సీట్లు పొంది అతి పెద్ద పార్టీగా అవతరించిన పార్టీని ఆహ్వానించాలని స్పష్టమైన మార్గదర్శకాలున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు లభించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్ల అవసరం ఉంది.