అమరావతి : శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎపి అసెంబ్లి స్పీకర్ కోడెల శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధుల పట్ల పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని వైకాపా ఎమ్మెల్యేలను కోరానని, వారు వస్తారనే భావిస్తున్నానని కోడెల చెప్పారు. సమావేశాల సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరుగకుండా చూడాలని ఆయన అన్నారు. మార్చి 23 జరిగే రాజ్యసభ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.