విశాఖలో శాశ్వతమైన కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. పెట్టుబడిదారులకు సాయం అందించేందుకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. పెట్టుబడుల పురోగతి వివరాలను ఆన్లైన్లో ఉంచామని పేర్కొన్నారు. గూగుల్, రిలయన్స్, అదానీ, మహీంద్రా గ్రూప్లతో అవగాహన ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు.