ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 97వ రోజు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. జగన్ తన 97వ రోజు పాదయాత్రను టకారిపాలెం శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర చల్లగిరిగిల, గడ్డమీదపల్లి క్రాస్, నందమారెళ్ల, యడవల్లి క్రాస్ మీదుగా పెదారికట్ల వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా చల్లగిరిగిల, నందనమారెళ్లలో జగన్ పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. పెదారికట్లలో జగన్ జనంతో మమేకం కానున్నారు.