ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇవాళ 91వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. జగన్ తన 91వ రోజు పాదయాత్రను మరికాసేపట్లో కందుకూరు నియోజకవర్గం నూకవరం నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర అత్తింటివారిపాలెం, బొంతవారిపాలెం, కాకుటూరు, చెర్లోపాలెం, ప్రశాంతినగర్ మీదుగా కందుకూరు వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా బడేవారిపాలెంలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం కందుకూరులో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. పాదయాత్రలో జగన్ ఇప్పటి వరకు 1,222.3 కిలోమీటర్లు నడిచారు.