విజయవాడ, సూర్య బ్యూరో : చంద్రబాబునాయుడు, కరువు కవల పిల్లలు లాంటి వారని చంద్రబాబును అతుక్కుని కరువు ఎప్పుడు వుంటుందని, కరువు రక్కసిపై దృష్టి సారించాలని బాబు నిర్లక్ష్యం కారణంగా రాష్ర్టం, రాష్ర్టంలోని రైతులు నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ రైతు విభాగం నూతన అధ్యక్షులు జెట్టి గురు న్నాధం అధ్వర్యంలో సోమవారం ఏపిసిసి రాష్ర్ట కార్యాలయంలో కిసాన్ భేత్ మజ్ధూర్ విభాగం రాష్ర్ట కమిటీ సమావేశంలో మాట్లాడుతూ తొలుత మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ మృతికి కొద్ది సేపు మౌనం పాటించి వారి మృతి పట్ల సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతికి తెలిపారు. కర్నా టక రాష్ర్టంలో అక్టోబర్ నెల కరువుపై కేంద్రానికి నివేదిక పంపితే కేంద్ర బృందాలు పరిశీలించిన తరువాత దాదాపు 1750 కోట్ల రూపాయల కేంద్రసాయం పొందారని ఇది మీకు సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. బాబు, మోడీ జోడి ఏమి అయిపొయిందని ప్రశ్నించారు. కరువుపై కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో పొరాటం చేస్తుందని సృష్టం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు వినతిప్రతం అందించామన్నారు. మార్చి 10లోపు కరువుపై తెలుగుదేశం ప్రభు త్వం స్పందించకపోతే ఏపిసిసి ముఖ్య నాయకులతో అనంతపురంలో సాముి హిక సత్యగ్రహం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. టిడిపి వివిధ సామా జిక వర్గాలకు ఎన్నికల ముందు 124 హామీలను ఇచ్చిందని, ఎస్సీ, ఎస్టీలకు, వర్గీకరణ చేస్తామని, మేలు చేస్తామని ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్నారు. పోలీసుల అనుమతితో ఈ నెల 27, 28 తేదిలల్లో 48గంటల నిరసనకు ఇతర బిసీ సంఘాల మద్దతుతో రజకుల సంఘం రాష్ర్ట నాయకుడు పి.అంజిబాబు నిరసనకు దిగుతున్న సమయంలో అతనితో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి పమిడిముక్కల, ఊంగుటూరు పొలీస్ స్టేషన్కు తరలించడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. ఉచిత పశుగ్రాశ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైతులకు 3 సంవత్సరాలుగా బకాయి ఉన్న ఇన్పుట్ సబ్సిడి, భీమా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపిసిసి ఉపాధ్య క్షులు తులసిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు టిజేఆర్ సుధాకర్ బాబు, రాజీవ్ రతన్, పి.సూరిబాబు, ఏపి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విషూ్ణ తదితరులు పాల్గొన్నారు.