నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి నారాయణ అన్నారు. ప్రపంచ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా బిందు మీనన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. బిందు మీనన్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రపంచంలో 5 కోట్ల మంది మూర్చ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. మూర్చ వ్యాధి పట్ల అవగాహన ఉంటే 80 శాతం వ్యాధిని నయం చేసుకోవచ్చని పేర్కొన్నారు.