కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు ఆయనను తరలించారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నట్ల వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.