మహారాష్ట్రలోని పుణెలో విషాద ఘటన జరిగింది. ఓ వ్యక్తి బుధవారం తన భార్య, ఆరు నెలల చిన్నారితో కలిసి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పుణె-నాసిక్ హైవేపై రాజ్గురునగర్ వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఆ వ్యక్తి ఓవర్ టేక్ చేయాలని యత్నించాడు. అయితే వారి బైక్ అదుపు తప్పి పడిపోయింది. తల్లి చేతిలో నుంచి ఆరు నెలల బిడ్డ జారి పడిపోయింది. ఆ చిన్నారిని తొక్కుకుంటూ ట్రాక్టర్ వెళ్లిపోయింది. తన కళ్ల ముందే బిడ్డ మరణించడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరైంది.