భార్యపై దాడికి పాల్పడిన భర్త పై పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదయింది. పోలీసులు కథనం ప్రకారం జేకేసీ నగర్ కు చెందిన స్వర్ణకి పట్టాభిపురానికి చెందిన శివ జవహర్ తో 2015 లో వివాహమయ్యింది. భర్త ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కొంతకాలంగా స్వర్ణ పుట్టింటిలో ఉంటున్నారు. ఇటీవల గుంటూరు వచ్చిన భర్త స్వర్ణను కాపురానికి తీసుకువెళ్తానని చెప్పి తీసుకువెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఆమెపై దాడి చేసి సెల్ ఫోన్ పగలగొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.