నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 81వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 81వ రోజు పాదయాత్రను ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర దువ్వూరు, సిద్దిపురం, వెంగారెడ్డి పాలెం క్రాస్, గాంధీ జన సంఘం, పల్లెపాలెం క్రాస్, పల్లెపాలెం మీదుగా సంగం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా సంగంలో జగన్ బహిరంగసభ నిర్వహించనున్నారు.