ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాటలతో కాదు, చేతలతోనే సమాధానం ఇస్తాం: భారత ఆర్మీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 05, 2018, 12:52 PM

మాటలతో కాదు, చేతలతోనే పాక్ కు సమాధానం చెబుతామంటోంది భారత ఆర్మీ. నిన్న సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడి భారత జవాన్లను బలితీసుకున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. ప్రతీకారం అన్నది మాటల రూపంలో కాకుండా జరిగిపోతుంది. దాని గురించి నేను చెప్పను. చేతలతోనే దానికి బదులిస్తాం అని ఆర్మీ వైస్ చీఫ్ శరత్ చంద్ అన్నారు. జమ్మూ కశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్ లో నిన్న పాకిస్థాన్ దళాల కాల్పులకు నలుగురు భారత జవాన్లు నెలకొరగడంతో దీనిపై ఆర్మీ జవాన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్థాన్ చర్యలను క్షమించేది లేదని, దీనికి ఆ దేశం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ అహిర్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com