న్యూఢిల్లి : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి, విద్య, వైద్యాలకు పెద్ద పీట వేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే బడ్జెట్ ఇదని ఆమె చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మరొక 3 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.