న్యూఢిల్లి : రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ల జీతాలను పెంచుతున్నట్లు జైట్లీ చెప్పారు. రాష్ట్రపతికి 5 లక్షల రూపాయిలు, ఉప రాష్ట్రపతికి నెలకు 4 లక్షల రూపాయిలు, గవర్నర్కు 3.5 లక్షల రూపాయిలు వేతనంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఎంపిల జీతం ఐదేళ్లు ఒకసారి పెంచేందుకు రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వేతన జీవులకు ఎలాంటి ఊరటా కలిగించలేదు. అందరూ ఊహించినట్లుగా ఆదాయ పన్ను పరిమితిని ఆయన పెంచలేదు. ఆదాయ పన్ను పరిమితి విషయంలో ఎటువంటి మార్పూ చేయలేదు. విమానయాన రంగాన్ని సామాన్యులకు అందుబాటులో ఉండేలా విస్తరిస్తున్నామని చెప్పారు. 900 కొత్త విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 56 విమానాశ్రయాలకు కనెక్టివిటీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.