ఉత్తర్ ప్రదేశ్లోని కస్గంజ్లో మత కలహాలు చెలరేగినప్పుడు ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి అతడి మరణానికి కారణమైన సలీమ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సలీమ్ తన నివాసంలో బాల్కనినుంచి కాని, టెర్రస్నుంచి కాని కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు చెప్పారు. గణతంత్ర దినోత్సవం రోజున బిజెపి, ఆరెస్సెస్ కార్యకర్తలు తిరంగా యాత్ర నిర్వహిస్తుండగా కొందరు దానిని అడ్డుకోవడంతో ఘర్షణలు చెలరేగి మత కలహాలు జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా చందన్ గుప్తా అనే 22 ఏళ్ల యువకుడు తుపాకీ బుల్లెట్లకు గురై మృతి చెందాడు.