ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థిపై వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 31, 2018, 11:55 AM

గోవా: 13 ఏళ్ల విద్యార్థిపై స్కూల్ ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడిన ఘటన మార్గావు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. లయోలా హైస్కూల్ ప్రిన్సిపాల్ సదరు విద్యార్థితోపాటు మరో ఇద్దరు విద్యార్థులను తరగతి గది నుంచి బయటకు పంపించాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ బయటకు వచ్చి విద్యార్థిని కొట్టాడు. అనంతరం విద్యార్థి మొఖం, తలపై కొట్టాడు. ప్రిన్సిపాల్ ఎలాంటి కారణం తీవ్రంగా కొట్టడంతో తమ కుమారుడు భయంతో వణికిపోతున్నాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి కపిల్ నాయక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com