రియల్టైం గవర్నెన్స్ ద్వారా అనేక సేవలను అందిస్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ మంత్రి లోకేశ్ శాన్ఫ్రాన్సిస్కోలో గూగుల ప్రతినిధులతో భేటీలో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయానికి ఇంటర్నెట్ సేవలు పెద్దగా విస్తరించలేదన్నారు. డేటా వినియోగం పెరిగితే జీడీపీ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రూ.149కే ఇంటర్నెట్, వైఫై, టెలివిజన్ సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవల విస్తరణ ద్వారా పెట్టుబడులకు అవకాశం ఉంటుందన్నారు. సెన్సార్లు, డ్రోన్లు, ఐవోటీ పరికరాల ద్వారా అనేక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పత్తి పంట వేస్తే నష్టం వస్తుందని గుర్తించి పత్తి పంట వేయకుండా ఆపగలిగామన్నారు. రైతులకు నష్టం రాకుండా ముందుగా జాగ్రత్త పడ్డామన్నారు. 13 శాతం వర్షపాతం తక్కువ ఉన్నా వ్యవసాయంలో 24 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు.