అవినీతి పరుడైన జగన్ తో బీజేపీ కలిసే ప్రశక్తే లేదని ఏపీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలుస్తానంటూ వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఫార్మాడీ విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా జగన్ వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. అవినీతి పరుడైన జగన్ తో బీజేపీ కలవదని ఆయన స్పష్టం చేశారు.