భోపాల్: గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ ఇవాళ మధ్యప్రదేశ్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్ హేమంత్ గుప్తా రాజ్భవన్లో జరిగిన వేడుకలో ఆనందీబెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమెకు పుష్షగుచ్ఛం ఇచ్చి కంగ్రాట్స్ తెలిపారు. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్గా ఉన్న ఓమ్ ప్రకాశ్ కోహ్లీ ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ గవర్నర్గా కూడా కొనసాగారు. 76 ఏళ్ల ఆనందీబెన్ పటేల్.. 2014 నుంచి ఆగస్టు 2016 వరకు గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆమె స్థానంలో సీఎంగా విజయ్ రూపానీ వచ్చారు.