జ్యూరిచ్: దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం జ్యూరిచ్ చేరుకుంది. పర్యటనలో భాగంగా జ్యూరిచ్-అమరావతి నగరాల మధ్య సిస్టర్ సిటీ ఒప్పందం, హిటాచీ సంస్థ, ఫ్రాన్హోఫర్ అసోసియేషన్తో మూడు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. పలు అంతర్జాతీయ సంస్థల సీఈవోలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సమావేశమం కానున్నారు. రేపు (23వ తేదీ) ఏపీ లాంజ్లో ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆహార భద్రత- వ్యవసాయ రంగం భవిష్యత్తు, ఏపీలో సహజసాగు విధానాల ద్వారా వ్యవసాయంలో తీసుకొచ్చే మార్పులు తదితర అంశాలపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, వ్యవసాయ సలహాదారు విజయ్కుమార్, ఈడీబీ సీఈవో కృష్ణకిషోర్, ఉన్నతాధికారులు సాయిప్రసాద్, సాల్మన్ ఆరోఖ్యరాజ్ తదితరులు ముఖ్యమంత్రి బృందంలో ఉన్నారు.ఈ బృందం నాలుగు రోజుల పాటు అక్కడ పర్యటించి ఈ నెల 26న అమరావతికి తిరిగి రానుంది