ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాగ్రత్తగా పని చేస్తే మనల్ని ఓడించే శక్తి ఎవరికీ లేదు : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2018, 11:33 AM

అమరావతి : జాగ్రత్తగా పని చేస్తే మనల్ని ఓడించే శక్తి ఎవరికీ లేదని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతున్నారు. వినూత్న ఆలోచనలు చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. సమస్యలు అధ్యయంన చేస్తూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నించాలని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలిసిందేనని అన్నారు. తెలుగుదేశం వర్క్ షాప్ లో ప్రసంగిస్తున్న ఆయన రాష్ట్ర విభజన వల్ల చాలా నష్టపోయామని, కష్టపడి పని చేస్తూ అభివృద్ధిలో పురోగతి సాధించినా, తలసరి ఆదాయంలో చాలా వెనుకబడి ఉన్నామని చంద్రబాబు చెప్పారు. విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను ఇటీవల ప్రధాని మోడీతో కలిసి చర్చించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని చంద్రబాబు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com