విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్ సహా విభజన హామీల అమలు కోసం రెండు రోజుల దీక్ష నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఈ నెల 27న ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఈ దీక్ష చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన విశాఖ రైల్వే జోన్ సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.