జమ్ము : సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో జమ్ము ప్రాంతంలోని పాఠశాలల్ని మూసివేయాలని అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పాఠశాలల్ని మూడు రోజుల పాటు మూసివేయాలని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులతో సహా నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.