ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి ఢిల్లీలో తలవంచారని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. జగన్ కు సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయటపెడతానని తెలిపారు. జగన్ వన్నీ పదో తరగతి పాస్-డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు అని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో వచ్చినవాటి కంటే వెళ్లిపోయిన పరిశ్రమలే ఎక్కువని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతనేది చర్చకు వస్తోందని ఆరోపించారు. వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధమని లోకేశ్ ప్రకటించారు.