ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో నదిలో పడవ బోల్తా పడి ఒకరు మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 09:49 PM

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఆదివారం ప్రయాణీకులతో వెళుతున్న పడవ గంగా నదిలో బోల్తా పడటంతో ఒక మహిళ మరణించింది.సుల్తాన్‌గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలమైన గాలి కారణంగా ప్రయాణికులతో వెళ్తున్న పెద్ద పడవ గంగా నదిలో మునిగిపోయింది. నదిలో నీటి ప్రవాహానికి ఎనిమిది మంది కొట్టుకుపోగా, ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం.స్థానిక ఏరియా పోలీసులతో పాటు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ఇప్పటి వరకు ఏడుగురిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com