ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెంటాడ మండలంలో ఆటోపై పడ్డ తాటి చెట్టు ఇద్దరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 09:33 PM

విజయనగరం జిల్లా, మెంటాడ మండలంలోని పెట్టాడ గ్రామం నుంచి ఆండ్ర గ్రామం వైపుకు వెళుతున్న ఆటోపై తాటి చెట్టు పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆండ్ర సమీపంలో ఉన్న కొండపర్తి గ్రామం నుంచి పెట్టాడ గ్రామంలో వ్యవసాయ పనులు చేసేందుకు ఆటోలో వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో తాటిచెట్టు ఆటోపై పడింది. దీంతో ఆటోను నడుపుతున్న డ్రైవర్ రొంగలి మహేష్, కొండపర్తి గ్రామానికి చెందిన గిరిజన మహిళ కూడా అక్కడికక్కడే ప్రాణాలు వీడారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వంగి ఉన్న తాటి చెట్టు ఆటోపై పడడం ఘోరం దీంతో మండలంలో విషాదఛాయలు అలముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com