ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాటిని ఎవరూ నమ్మోద్దు: ఎంపీ కేశినేని నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 07, 2022, 11:44 PM

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వస్తున్న ట్విట్లను ఎవరూ నమ్మవద్దని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని కోరారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం రేగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనను విమర్శిస్తున్నట్టుగా ఆ ట్వీట్లు ఉండడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. సోషల్ మీడియాలో ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. దీనిపై కేశినేని నాని స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ట్వీట్లు తనవి కావని స్పష్టం చేశారు. ఫేక్ ట్వీట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. అటు, ఎంపీ కేశనేని నాని కార్యాలయం అవి ఫేక్ ట్వీట్లు అంటూ స్పష్టం చేసింది. వాటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com