ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి భవన్ లో ఆ నటుల అరుదైర కలయిక

national |  Suryaa Desk  | Published : Sun, Aug 07, 2022, 11:39 PM

 ఆజాదికా అమృతోత్సవ్ పేరిట ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు వేదికను పంచుకొన్నారు. ఈ క్రమంలో  రజనీకాంత్, అనుపమ్ ఖేర్ ఆదివారం రాష్ట్రపతి భవన్ వద్ద వీరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోలు తీసుకున్నారు. రజనీకాంత్ తన మిత్రుడంటూ ఈ ఫొటోను అనుపమ్ ఖేర్ అందరితో పంచుకున్నారు.


నా స్నేహితుడు రజనీకాంత్ మాదిరి మరొకరు ఉండరు. ఎప్పటికీ లేరు, ఉండరు. జైహో అజాదీకా అమృతోత్సవ్’’అంటూ ఇన్ స్టా గ్రామ్ లో అనుపమ్ ఖేర్ పోస్ట్ పెట్టారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర సర్కారు ఆజాదికా అమృతోత్సవ్ పేరిట ఉత్సవాలను నిర్వహిస్తోంది. రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న ఈ ఉత్సవాలకు అనుపమ్ ఖేర్, రజనీకాంత్ హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com