ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమాంతంగా పేట్రోల్ ధరలను పెంచిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

international |  Suryaa Desk  | Published : Sun, Aug 07, 2022, 11:31 PM

బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంధన ధరలను అమాంతం పెంచి అక్కడ ప్రజలపై మోయలేని భారాన్ని మోపింది. ఉన్న ధరపై 50 శాతం అధికంగా రేటును పెంచింది. దాంతో అక్కడి జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఇంధన ధరలను 51.7 శాతం వరకు పెంచింది. 1971లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక పెరుగుదల ఇదేనని అక్కడ మీడియా నివేదికలతో తెలుస్తుంది.


ప్రభుత్వం కొత్త ధరలను ప్రకటించిన తర్వాత శుక్రవారం రాత్రి పెట్రోల్ బంక్‌ల దగ్గరకు జనం పరుగులు తీశారు. వేలాది సంఖ్యలో వాహనదారులు బంక్‌ల దగ్గరకు చేరుకున్నారు. కొత్త ధరలు అమల్లోకి రాకముందే తమ వాహనాల ట్యాంకులను నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొత్త ధరలు అమల్లోకి రావడంతో ఢాకాలోని మొహమ్మద్‌పూర్, అగర్‌గావ్, మాలిబాగ్, ఇతర ప్రాంతాల్లో అనేక పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌లు కొత్త ధరలు అమల్లోకి వచ్చాయని, అర్ధరాత్రి తర్వాత అమ్మకాలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించాయి. ఈ మేరకు ఆ స్టేషన్‌లను క్లోజ్ చేశారు. దీంతో కొన్ని చోట్ల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.


పెరిగిన ధర ప్రకారం బంగ్లాదేశీ కరెన్సీలో ఒక లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం 135 టాకా (1.43 డాలర్లు) ఉంది. ఇది మునుపటి రేటు 89 టాకా  (0.94 డాలర్లు) కంటే 51.7 శాతం ఎక్కువ. అయితే బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ తక్కువ ధరలకు ఇంధనాన్ని విక్రయించడం ద్వారా ఫిబ్రవరి నుంచి జూలై వరకు చాలా నష్టాన్ని చవిచూసినట్టు ప్రభుత్వ నివేదికలు ద్వారా వెల్లడైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలను ప్రభావితం చేశాయి. దీంతో అన్ని దేశాల్లో చమురు ధరలు భారీగా పెరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com