దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆగస్టు 9 వరకూ భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ తుఫాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కోస్తా, కర్ణాటక, యానాం, కేరళ, మాహేలలో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.