ఇండియన్ రైల్వే ప్రయాణికులకు ముఖ్య ప్రకటన చేసింది. శనివారం ఇంజనీరింగ్ పనుల కారణంగా రాజస్థాన్లో అనేక రైళ్లు రద్దు చేసినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే సీపీఆర్వో కెప్టెన్ శశికిరణ్ చెప్పారు. అలాగే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని నగర్పూర్ డివిజన్లోని కన్హాన్ స్టేషన్లో కొత్త సైడింగ్ లైన్ వేయడం కోసం నాన్-ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 13 వరకు పలు రైళ్లు రద్దు కానున్నాయి.