జనసేన వీరమహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం ఉదయం సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన భవిష్యత్ కార్యాచరణపై పవన్ వారితో చర్చించారు. ఇటీవల కోనసీమ వరద బాధితుల కోసం వీర మహిళలు చేసిన కృషిని పవన్ పేరుపేరునా అభినందించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సత్కరించారు. వారి కృషిని ప్రశంసిస్తూ జ్ఞాపికలు కూడా అందజేశారు.