నేపాల్లో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆరు రోజుల క్రితం నేపాల్లోని ధితుంగ్లో భారీ భూప్రకంపనలు సంభవించగా.. తాజాగా శనివారం నేపాల్లోని నువాకోట్ జిల్లా బెల్కోట్గాడి పరిసర ప్రాంతాల్లో ఉదయం 5.26 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు నేషనల్ ఎర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది.