మంగళగిరి: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ నెల 21న మంగళగిరి విచ్చేయనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా శివాలయం రథశాల పక్కన దాత కృష్ణా షూ యజమాని మాదాల వెంకటేశ్వరరావు సౌజన్యంతో నిర్మించిన 51 అడుగుల మహాశివుని విగ్రహ ప్రారంభోత్సవాన్ని దత్తాత్రేయ చేతుల మీదుగా చేయనున్నట్టు తెలుస్తోంది. వీటితో మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది.