ప్రస్తుతం దేశంలో కరోనా, మంకీపాక్స్ భయపెడుతున్నాయి. ఈ తరుణంలో లంపీ స్కిన్ వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఇది పశువులకు మాత్రమే సోకుతుంది. ఈ వైరస్ వల్ల రాజస్థాన్లో 4,500ల ఆవులు, గుజరాత్లో 1,800ల ఆవులు మృతి చెందాయి. ఈగల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వల్ల దేశంలో ఇప్పటి వరకు 6 వేల ఆవులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వైరస్ సోకిన ఆవులకు ఎర్రటి బొబ్బలు పుండ్లుగా మారి, శరీరమంతా వ్యాపిస్తాయి.