కావలసిన పదార్ధాలు : బియ్యం - 1 కప్, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత, చింతపండు - 50గ్రా., కరివేపాకు - రెండు రెబ్బలు, ఆవాలు - 2 స్పూన్లు, మెంతులు - 1 స్పూన్, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 6, చిన్న అల్లం ముక్క -1, బెల్లం - కొద్దిగా, తాలింపు దినుసులు - 2 స్పూన్లు.
తయారీ విధానం:
-- ముందుగా చింతపండును వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తరవాత రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
-- ఒక కప్ రైస్ కి రెండు కప్పుల చొప్పున నీటిని తీసుకుని కుక్కర్ పెట్టుకుని, మూడు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే, అన్నం పొడిపొడిలాడుతూ, మెత్తగా బాగుంటుంది.
-- ఇప్పుడు ఈ అన్నంలో పసుపు, నూనె, కరివేపాకు, ఉప్పు వేసి మృదువుగా కలపండి.
-- ఇప్పుడొక మిక్సీ జార్ తీసుకుని అందులో ఆవాలు, చిన్న అల్లం ముక్క, రెండు ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-- స్టవ్ వెలిగించి, నూనె వేస్, ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. ఇంకా కరివేపాకు, కొంచెం ఇంగువ వెయ్యాలి. ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. అందులోనే కొద్దిగా బెల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి.
-- ఇందాక మిక్సీ పట్టుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఆపై రైస్ ను కూడా వేసి కలపాలి.
-- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, బాణలి పెట్టుకుని, నూనె వేసి, తాలింపు పెట్టుకుని, దీనిని రైస్ లో కలుపుకుంటే, రుచికరమైన, గుళ్లో ప్రసాదంని గుర్తుకు తెచ్చే పులిహోర రెడీ.