ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మీయ సత్కార సభను విజయవంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 08:55 PM

విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు కు జాకీర్ హుస్సేన్ నగర్ మస్జిద్- ఈ -అల్ ఖాదిర్ ఇతర ముస్లిం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించబోయే ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీవీఎంసీ 53 వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు బర్కత్ అలీ కోరారు.


ఈ మేరకు శనివారం సాయంత్రం వైసిపి వార్డు కార్యాలయం లో శనివారం సాయంత్రం వైసీపీ వార్డు నాయకులతో పాటుగా కార్యకర్తలతో బర్కత్ అలీ సమీక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసిపి శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ బాబ్జి, రామలక్ష్మి, లోక్నాథ్ పాత్రో, హనుమంత్, జయ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com