తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలో రేణిగుంట విమానాశ్రయం సమీపాన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విమానాశ్రయం సమీపాన ఉన్న చిన్న వంతెనను అదుపుతప్పిన లారీ ఢీకొనడంతో తిరుపతి కాళహస్తి రహదారిలో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తిరుపతి-శ్రీకాళహస్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు రెండు గంటల నుండి అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు.