ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ ప్రారంభం..26న ఓట్ల లెక్కింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 09:16 AM
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా ఈ ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్‌.చక్రధర్‌బాబు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇకపోతే ఈ నెల 26వ తేదీన ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంది. వైసిపీ తరపున మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ తరపున జి.భరత్‌కుమార్‌ యాదవ్‌ తో పాటు మరో 14 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. 279 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్ జరుగనుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com