ఏపీలోని విద్యార్థుల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేందుకు మరిన్ని సదుపాయాలను కల్పించనుంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి తరగతి గదిలో టీవీలు ఉంచనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. బైజూస్ తో ఉన్నతమైన విద్య, నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థికి అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.