ఇదివరకటి రోజుల్లో పెద్దోళ్ళు చిన్న పిల్లలకు స్నానం చేయించడానికి ముందు వెన్నను ఒంటికి పట్టించి, నలుగు పెట్టి, ఆ తర్వాత స్నానం చేయించేవాళ్ళు. దీంతో చర్మంపై ఉండే సన్నని వెంట్రుకలు తొలగిపోవడమే కాకుండా, చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
వెన్నను ముఖానికి రాసుకుని, ఆపై సున్నిపిండి, పసుపు కలిపిన మిశ్రమాన్ని ముఖాన్ని రుద్దుకోవడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది. కాస్త రంగు తక్కువగా ఉన్నవారు వెన్నలో తేనెను కలిపి నిత్యం చర్మం పై రాస్తూ ఉండడం వల్ల చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది. వెన్నలో కోడిగుడ్డు తెల్ల సొనను కలిపి రాసుకోవడం వల్ల కళ్ల కింద ఉండే మచ్చలు, ముడతలు తగ్గుతాయి. వెన్నలో పసుపును కలిపి రాయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి. ప్రతిరోజూ భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో వెన్నను కలిపి తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.