ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజూ ఆకుకూరలు తింటే ఏమవుతుందో తెలుసా...?

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 09:49 PM

రోజూ మనం తినే ఆహారంలో ఆకుకూరల్ని, బీట్ రూట్ ని భాగం చేసుకుంటే, హృద్రోగ సమస్యలు దూరమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక నివేదిక ప్రకారం, ఏటా సుమారు రెండు కోట్ల మంది గుండె రోగాలతోనే మరణిస్తున్నారట. నిపుణులు చేసిన ఒక పరిశోధన ప్రకారం, నైట్రేట్ ఎక్కువగా ఉండే కూరగాయల్ని తీసుకునేవాళ్లలో సిస్టోలిక్ బిపి తక్కువగా ఉంటుందనీ, అలాంటి వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువేనని గుర్తించారు. ముఖ్యంగా ఆకుకూరల్ని తరచుగా తినే వాళ్ళ కాళ్లల్లో రక్తనాళాలు కుచించుకుపోవడం, గుండెనొప్పి, పక్షవాతం, ఆకస్మిక గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తక్కువట. ఐతే, వీటిని జ్యూస్ రూపంలో తీసుకునే కన్నా ఉడికించి తింటేనే ఎక్కువ ఫలితం ఉంటుందని, కండరాలకు మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com