ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చర్మం సహజకాంతిని సొంతం చేసుకునేందుకు సింపుల్ చిట్కా

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 09:16 PM

ఒక స్పూన్ గోధుమ పిండికి, అంతే పరిణామంలో కొంచెం పుల్లటి పెరుగును, పాలను, కొంచెం నిమ్మరసాన్ని, చిటికెడు పసుపును కలిపి మెత్తటి మిశ్రమంలా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖాన్ని పొడిగుడ్డతో తుడుచుకుని చేతితో ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత, పాలలో ముంచిన దూది లేదా గుడ్డతో ముఖం పై వలయాకారంలో స్క్రబ్ చెయ్యాలి. ఇలా ఐదు నిమిషాల పాటు రుద్ది పది నిమిషాలపాటు ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత ముఖాన్ని మరోసారి పాలలో ముంచిన దూదితో స్క్రబ్ చేసి ఆపై నీటితో కడిగేసుకోవాలి. అయితే, సబ్బు పెట్టి ముఖాన్ని రుద్దకూడదు. ఒక రెండు గంటలపాటు సబ్బు, క్రీం లాంటివి మొహానికి రాయకుండా ఉండండి. ఇలా చెయ్యడం వల్ల స్కిన్ ఎల్లప్పుడూ హెల్దీ గా, మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. దీంతో ముఖం కొత్తకాంతిని సంతరించుకుంటుంది. ఈ చిట్కా యాంటీ ఏజింగ్ లా కూడా పనిచేస్తుంది. రోజుకు రెండు సార్లు ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల ముఖంలో యిట్టె తేడా తెలిసిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com