ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా శ్రీ కామేశ్వరీ సమేత మహానందీశ్వరుడు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ఆలయ ఆవరణలోని రుద్ర గుండం ఆలయ వెలుపల చిన్నపాటి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తూరు భక్తులు సందడి చేశారు. మహానందికి భక్తులు తాకిడి అధికంగా ఉండటం వల్ల క్షేత్ర ప్రాంగణం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చింది. ఇదిలా ఉంటే విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.