15 లక్షల రూపాయల విలువైన మద్యం బాటిల్స్ ను వినుకొండ సెబ్ అధికారులు ధ్వంసం చేశారు. సెబ్ అడిషనల్ ఎస్పీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ 2020 మే నుండి 2022 వరకు మే వరకు వివిధ కేసుల్లో పట్టుబడ్డ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర తో వివిధ రాష్ట్రాలకు చెందిన 15 లక్షల రూపాయల మద్యం సీసాలను వినుకొండ పట్టణంలో పసుపులేరు వంతెన వద్దగల డంపింగ్ యార్డ్ వద్ద రోడ్డు రోలర్ సాయంతో ధ్వంసం చేశామన్నారు.